చలో విజయవాడ పిలుపునిస్తాం..! డివైఎఫ్ఐ

చలో విజయవాడ పిలుపునిస్తాం..! డివైఎఫ్ఐ

కర్నూ లు న్యూస్ వెలుగు : డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కర్నూల్ నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ లో రోడ్డుపైన బహిరంగంగా అధ్యయనం చేస్తూ డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ మాట్లాడుతూ అనేక ఉద్యమాలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి డీఎస్సీ అభ్యర్థులందరూ న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి

1.ఒక జిల్లాకు ఓకే పేపర్

2.డిఎస్సీ అభ్యర్థుల ప్రిపరేషన్ కు 90 రోజులు గడువు ఇవ్వాలని,
3.వయోపరిమితి 47సం లకు పెంచాలని

4.ఇంటర్, డిగ్రీ మార్కులు 40% తగ్గించాలని

5.ఓపెన్ విద్య చదివిన వారికి అవకాశం ఇవ్వాలని,

6.డిగ్రీలో BSC లో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి SA లో PS అవకాశం ఇవ్వాలని

7.పీఈటీ పోస్టులు పెంచాలీ.

8.టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 9. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ పూర్తయ్యే వరకు పరీక్షను పోస్టు ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2018లో ఆన్లైన్ డీఎస్సీ వల్ల ఆఫ్లైన్లో టెట్లో జిల్లా టాపర్ గా ఉన్న వాళ్ళు సైతం ఉద్యోగాలు కోల్పోయి కేవలం రెండు పేపర్లు రాసిన వారికి మాత్రమే ఉద్యోగాలన్నీ వచ్చాయని దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే డీఎస్సీ రాసే ప్రతి అభ్యర్థికి నష్టం జరుగుతుందని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ అభ్యర్థుల ఆ వెదటను బాధను తీవ్రమైన సమస్యలను చర్చించి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కర్నూల్ మండల కార్యదర్శి ప్రకాష్ సహాయ కార్యదర్శి హరికిషన్ రెడ్డి నాయకులు విశ్వనాథ్ ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ భారీగా నిరుద్యోగులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS