జిల్లా అధ్యక్షునిగా అమానుల్లా ఎన్నిక

 జిల్లా అధ్యక్షునిగా అమానుల్లా ఎన్నిక

హోళగుంద, న్యూస్ వెలుగు : జన సంరక్షణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులైన రజాక్ వలి ఆదివారం కర్నూలు జిల్లా అధ్యక్షునిగా అమానుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం ఎన్నిక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రజాక్ సాబ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పన పై అవగాహన కల్పించడం మరియు ప్రభుత్వం పథకాల పై ప్రజలను చైతన్యం కలిగించడం,గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమలను కుటీర పరిశ్రమల కొరకు చైతన్యం కలిగించడం,అనాధ పిల్లలకు విద్యా మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ అధ్యక్షులు వసంత బాబు,వివిధ జిల్లాల అధ్యక్షులు,కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS