తమ ప్రాణాలకు పోలీస్ అధికారులు రక్షణ కల్పించాలి

తమ ప్రాణాలకు పోలీస్ అధికారులు రక్షణ కల్పించాలి

దౌర్జన్యంగా సాగులో ఉన్న భూమిని ఆక్రమించారు

రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ; జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి గ్రామ సర్వే నెంబర్ 579 లో గత 12 సంవత్సరాల నుండి 5 ఎకరాల 41 సెంట్ల భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నామని,తమ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించారని బాధితులు రోటికాడి జయలక్ష్మి,రామకృష్ణ లు వాపోయారు. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిని కొండ గట్టలను చదును చేసుకుని తయారు చేసుకున్నామన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా భూమిని తయారు చేసేందుకు దాదాపు 30 లక్షల రూపాయలు తాము ఆ భూమి పై ఖర్చు చేశామన్నారు. ఎన్నో వేయప్రయాసాలను భరించి ఆ భూమిలో సాగు చేస్తున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తమ భూమి పై వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ సాగు భూమిలో రెండు బోర్లను సైతం వేసుకొని నీటి సౌకర్యం కల్పించామని, దానిని ఓర్వని కొందరు వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ లను సైతం చోరీ చేసి ఎత్తుకు వెళ్లారని తెలిపారు. ఆ భూమికి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని వ్యవసాయం చేసుకొని జీవనం సాగిచుచున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నా భర్త రామకృష్ణ అనారోగ్యం వలన కర్నూల్ ఆసుపత్రిలో ఉండడంతో దీనిని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. సదురు వ్యక్తులు మేము భూమి వద్దకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, పోలీస్ వారు తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దౌర్జన్యంగా తమ భూమి ఆక్రమించుకున్న వారి నుండి తమకు ప్రాణహాని ఉందని, పోలీస్ వారు తక్షణమే తమకు రక్షణ కల్పించాలని అన్నారు. అక్రమార్కులు గత వైసీపీ ప్రభుత్వంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసారని, తమ ఆస్తులపై దాడి చేసి, మా ఆయన రామకృష్ణ ను కొట్టడం కూడా జరిగిందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమార్కుల పై చర్యలు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!