మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు

మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు

ఢిల్లీ, న్యూస్ వెలుగు; ఇప్పటి వరకు అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. కనీసం 18 ఏళ్లు నిండాల్సిందే అని ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే.. అది బాల్యం వివాహం కిందకు వస్తుంది. దాంతో ప్రభుత్వం అలాంటి వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకునేది. ఇక అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా 18 ఏళ్లు నిండితేనే మేజర్లుగా పరిగణిస్తారు. అయితే ఇకపై అలా కుదరదు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండితే చాలు అనేకునేవారికి ప్రభుత్వం షాకిచ్చింది. యువతుల వివాహ వయస్సును పెంచుతూ బిల్లు పాస్ చేసింది. ఆ వివరాలు..

మహిళల వివాహ వయస్సుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాలు కాదని.. దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మన దేశంలో మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని 21 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సర్కార్.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. దానికి ఆమోదం కల్పించింది.

అయితే లింగ సమానత్వం కోసమే ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ధని రామ్ శాండిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ఇంతకు ముందే అనగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టినా.. అప్పుడు ఆమోదం పొందలేదు. దాంతో మరోసారి ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. ఈ సారి బిల్లు ఆమోదం పొందింది.

Author

Was this helpful?

Thanks for your feedback!