ఎల్లార్తి హుండీ లెక్కింపులో వాగ్వాదం

ఎల్లార్తి హుండీ లెక్కింపులో వాగ్వాదం

దర్గాకు వచ్చిన భక్తులకు సమస్యలే….సమస్యలు.
దర్గా ఆదాయాని లెక్కిస్తున్నారే కానీ…అభివృద్ధి మాత్రం శూన్యం.

హొళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో శనివారం రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన హజరత్ షేక్షవలి,షాషావలి తాత దర్గాలో రాష్ట్ర వర్క్ బోర్డు సూపర్డెంట్ షేక్ మహమ్మద్ హుసేన్,ఈఓ ఇమ్రాన్,ఆదోని వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ సోహెల్ సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.ముందుగా గ్రామస్థులు వర్క్ బోర్డు అధికారులతో వాగ్వాదానికి దిగాడు.ప్రధానంగా దర్గా హండిని లెక్కిస్తున్నారే కానీ…దర్గా అభివృద్ధి మాత్రం శూన్యమని మండిపడ్డారు.అంతేకాకుండా దర్గాకు వచ్చిన భక్తులకు మాత్రం సమస్యలు తాండవిస్తున్నాయని చెప్పారు.మరియు వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.అనంతరం 4 నెలలకు సంబంధించిన హుండీని లెక్కించగా రూ.7,72,650 /-  78 తులాల వెండి వచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!