
మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు
నగరపాలక మేనేజర్ ఎన్.చిన్నరాముడు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో అవసరమైన చోట్ల మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడు అన్నారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ఆయనను 29వ వార్డు వెంకటేశ్వర నగర్ వాసులు, భారత కమ్యూనిష్టు పార్టీ నాయకులు కలిశారు. ఆంజనేయ స్వామి గుడి వెళ్ళే రహదారిలో మురుగు కాలువలు లేక మురుగునీరు రహదారిపైకి వస్తుందని వారు మేనేజర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, స్థానికులు సులోచనమ్మ, పద్మ, జయలక్ష్మి, రాజు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar