
రైతు కుటుంబానికి చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
* ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
* పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు
తుగ్గలి, న్యూస్ వెలుగు : తుగ్గలి మండల పరిధిలోని గల కడమకుంట్ల గ్రామానికి చెందిన కురువ రామచంద్ర అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఏడు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేసింది.ఈ సందర్భంగా మృతి చెందిన రైతు భార్య కురువ సరస్వతీకు మంగళవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు రాష్ట్ర ప్రభుత్వం చేత మంజూరైన 7 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి,తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో సావిత్రి,ఏవో పవన్ కుమార్, ఎంపీఈఓ స్రవంతి,విఏఏ లోహిత్,టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షుడు వెంకట రాముడు చౌదరి,తుగ్గలి తెలుగు మహిళా మండలి అధ్యక్షురాలు రాతన ఈరమ్మ, కడమకుంట్ల మాజీ సర్పంచ్ పకీరప్ప, వెంకటపతి,రైతు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.