కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా

న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రంలో కొత్త రీచ్ లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలి గనుల శాఖ ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.శుక్రవారం ఇసుక సరఫరా అంశంపై గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక నిల్వలు పెంచేందుకు కొత్త ఇసుక రీచ్ లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉంచాలన్నారు. అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!