
ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి : కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు): విభిన్న ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం నందు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్, వీల్ చైర్ లు, ట్రాన్స్ జెండర్ లకు గుర్తింపు కార్డులు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రయిస్ ఫాతిమా పాల్గొన్నారు.



