ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మేము సహకరిస్తాం ..!

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మేము సహకరిస్తాం ..!

పొద్దుటూరు న్యూస్ వెలుగు : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే  రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వైస్సార్సీపీ  కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి , రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , బద్వేల్ శాసనసభ్యులు దాసరి సుధా , ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి , జెడ్పీ ఛైర్మన్ రాంగోవింద రెడ్డి , కడప మేయర్ సురేష్ బాబు , మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పలువురు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం   గోపవరం పంచయితీ ఉపసర్పంచ్ ఎన్నికల సందర్భంగా వైయస్ఆర్ సీపీకి చెందిన పలువురు నేతలపై జరిగిన దాడిని ఖండిస్తూ తమ సంఘీభావం తెలిపారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. అందుకు కడప జిల్లా వైయస్ఆర్ సీపీ సహకరిస్తుందని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS