
ఏపీలో దివ్యాంగ పింఛన్ దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు
న్యూస్ వెలుగు , అమరావతి; ఏపీలో దివ్యాంగుల పింఛన్ దారుల్లో అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6 వేల పింఛన్ పొందుతున్న సుమారు 7 లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 700 వైద్య బృందాల ద్వారా పరీక్షలు చేయనున్నారు.
Was this helpful?
Thanks for your feedback!