
గోశాలను ప్రారంభించిన మంత్రులు
మంగళగిరి : మంగళగిరి మండలం యర్రబాలెంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తో కలిసి ప్రారంభించాను. శ్రీ భగవాన్ మహవీర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నాను. మంగళగిరి అభివృద్ధి కోసం అందరం కష్టపడతామని, ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతిప్రకారం నెరవేరుస్తామని విలేకరుల సమావేశంలో తెలిపారు . నియోజకవర్గంలో 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని వారు అన్నారు. ఉగాధి తర్వాత మొదటి విడతగా 5వేల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తామని వెల్లడించారు .
స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించాను.
Was this helpful?
Thanks for your feedback!