
గౌతమ్ అదానితో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ అమరావతి న్యూస్ వెలుగు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని బుధవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించేవిదంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నెల్కొలపాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సీఎంఓ కార్యాలయం వెల్లడించింది.

Was this helpful?
Thanks for your feedback!

