పదోవ తరగతి విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన మహిళా విభాగ అధ్యక్షురాలు

పదోవ తరగతి విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన మహిళా విభాగ అధ్యక్షురాలు

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరీక్ష కిట్లు పంపిణి

సత్తెనపల్లి, న్యూస్ తెలుగు: స్థానిక సత్తెనపల్లి పట్టణంలో బాలిక ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలిపి, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించి, అనంతరం విద్యార్థులకు “పెన్ను, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్” కిట్టులను 220 మంది విద్యార్థులకు *హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు అంచుల కాళీ దుర్గ* పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో తన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రతి విద్యార్థి పరీక్షను ఒత్తిడి లేకుండా గురువులు చెప్పిన సలహాలు పాటిస్తూ మంచి మార్కులు సాధించి, చదువుకున్న పాఠశాలను మరవకూడదని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి గోపి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!