ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబరు 08518277305

కర్నూలు, న్యూస్ వెలుగు : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా సూచించారు. ఇందు కోసం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. 08518-277305 నెంబరుకు ఫోన్‌ చేసి సమస్యను తెలియజేయాలన్నారు. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల్లో కూడా కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, విద్యుత్‌, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్‌ రహదారులు, భవనాలు తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సమయంలో తగిన సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకల వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌

నగరంలోని కర్నూలు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో ఎం.శేషిరెడ్డి శనివారం తెలిపారు. శని, ఆదివారాల్లో అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే 99120 69678, 63037 56113, 81217 86680 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!