
బహిరంగ ర్యాలీ ని జయప్రదం చేయండి
కర్నూలు న్యూస్ వెలుగు : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీ ని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జాకీర్ మౌలానా రష్ది పిలుపునిచ్చారు. మసీద్ ఏ రిసల్ దార్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ మౌలానా రష్దీ ,కోకన్వీనర్లు ,ఎస్ ఎం డి షరీఫ్, ఎం ఎ హమీద్, జయరాజు లు మాట్లాడుతూ సోమవారం ఉదయం 9 గంటలకు సోమవారం ఇస్లామియా అరబ్బీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ర్యాలీ శాంతియుతంగా ,సామరస్యంగా కొనసాగడానికి ముస్లిం యువకులతో పాటు, హిందూ ,క్రైస్తవ సోదరులు సహకరించాలని, పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో మీరందరూ రావాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, తక్షణమే సవరణలు వెనక్కి తీసుకోవాలని పాత చట్టాన్ని కొనసాగించాలని ,కేంద్ర ప్రభుత్వన్నీ డిమాండ్ చేసారు.
Was this helpful?
Thanks for your feedback!