భవిష్యత్తు విద్యార్థి ఉద్యమం ఇక్కడే నుంచే ..!

భవిష్యత్తు విద్యార్థి ఉద్యమం ఇక్కడే నుంచే ..!

సత్యసాయి జిల్లా : కొత్తచెరువుమండలం లో  విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 6వ ప్లీనరీ సమావేశాలు ఆగస్టు 9,10న రెండు రోజులపాటు కొత్త చెరువు లో ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర ఉపాద్యక్షులు పరమేష్ తెలిపారు . ప్లీనరీ కి  వందలాదిమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలో  బహిరంగ సభను ఏర్పాటు చేశామన్నూరు .  గత ప్రభుత్వంలో విద్యారంగంలో చేసిన విద్యార్థి వ్యతిరేక మార్పుల గురించి బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు.

అనంతరం వివిధ మండలాలు నియోజకవర్గాల నుంచి హాజరైన సుమారు 300 మంది ప్రతినిధులతో ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ ప్రతినిధుల సభలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మిస్ కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని, జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సంక్షేమ హాస్టల్లో నిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గ కేంద్రాలలో ఐటిఐ కళాశాలలో డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, వివిధ సమస్యల మీద తీర్మానాలు సభలో ఆమోదించుకొని భవిష్యత్తు ఉద్యమానికి దిశానిర్దేశం చేసుకున్నారు. విద్యారంగ సమస్యలపై కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి, బాబ్ జాన్, పవన్ కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, హర్ష కుమార్ మరియు పుట్టపర్తి నాయకులు హరి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!