
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న నారాలోకేష్
మంగళగిరి :నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నాను. కుటమి నేతలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. జై ముత్యాలమ్మ తల్లి, జై పోతురాజు స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాను. అనంతరం స్థానికులతో కలిసి ఫోటోలు దిగాను. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించాను.
Was this helpful?
Thanks for your feedback!