
వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి
అమరావతి (న్యూస్ వెలుగు): వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 11 తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజన పైనా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!