
శ్రీశైలంలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపైకి
శ్రీశైలం న్యూస్ వెలుగు: శ్రీశైల మహా క్షేత్రాన్ని నిత్యం భక్తులు దర్శిస్తుంటారు. అలాంటి శ్రీశైల మహా క్షేత్రంలో భక్తులు సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన మల్లికార్జున సత్రం ముందు డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఆలయ అధికారులు త్వరగా స్పందించి మురుగునీరు రోడ్డుపై పారకుండా మరమ్మతులు త్వరగా చేయాలని భక్తులు కోరారు.
Was this helpful?
Thanks for your feedback!