
సచివాలయాలు ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కమిషనర్
బేతంచెర్ల( న్యూస్ వెలుగు) :బేతంచేర్ల పట్టణంలోని 1, 2 సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్,మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలోభాగంగా అయన రికార్డులను పరిశీలించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ…సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని,ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.దరఖాస్తుల పట్ల మరియు సర్వేల యందు నిర్లక్ష్యం చేయరాదని,సిబ్బంది విరుద్ధంగా ప్రవర్తించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి,వారికి సేవలు అందించాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

