సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్

తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అలాగే, కొత్తగా తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన నిరంజన్ , కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌ , తిరుమలగిరి సురేందర్‌ , బాలలక్ష్మి ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్‌లకు చైర్మన్‌గా, సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS