స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలి: మంత్రి నారాలోకేష్
అమరావతి (న్యూస్ వెలుగు): ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సమీక్ష నిర్వహించాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలి. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని ఆదేశించాను. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఈడీబీ సమావేశంలో అధికారులను ఆదేశించాను.

Was this helpful?
Thanks for your feedback!