
ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు : మంత్రి
విజయవాడ: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద ప్రభావంతో అతలాకుతలమైన ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

విజయవాడ ప్రాంతంలో చాలా నష్టం జరిగిందని వారు అన్నారు.
ఇప్పుడిప్పుడే వరద బాధల నుంచి కోలుకుంటున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచేలా నిత్యావసర వస్తువులు అందించాలని నిర్ణయించామన్నారు . ఒక కిట్ రూపంలో రాష్ట్రంలో వరద ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి ఇవి అందుతాయని తెలిపారు. మొదటగా విజయవాడ నుంచి ఈ పంపిణీ ప్రారంభించి ప్రతి ఇంటికీ వెళ్లి ఈ కిట్ ను ప్రభుత్వ సిబ్బంది వరద బాధితులకు అందిస్తారని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

