
మండలానికి 50 స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు
ఎంపీడీవో విశ్వ మోహన్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ కింద తుగ్గలి మండలానికి మొత్తం 50 స్వయం ఉపాధి యూనిట్లు మంజూరైనట్లు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి-ఏ వారికి 21,బీసీ-బి వారికి 12,బిసి-డి వారికి 7,బిసి-ఈ వారికి 10 యూనిట్లు కేటాయించడం జరిగిందని ఆయన తెలియజేశారు. బ్యాంకుల వారీగా ఏపీజీబీ తుగ్గలి వారికి 21,ఏపీజీబీ జొన్నగిరి వారికి 14, ఎస్.బి.ఐ పెండేకల్ ఆర్ ఎస్ వారికి 15 యూనిట్లు మంజూరు అయినట్లు ఆయన తెలియజేశారు.50% వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని,21 నుండి 60 సంవత్సరముల లోపు ఉన్నవారు స్వయం ఉపాధి కింద యూనిట్ల మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.ఇతర వివరాలకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి ను సంప్రదించాలని ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.