
ఆయన అస్తమయం దేశానికి తీరని లోటు : పవన్ కళ్యాణ్
అమరావతి : పారిశ్రామిక రంగంలో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రతన్ టాటా నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడు. ఆయన అస్తమయం దేశానికి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిందన్నారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి , అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను.