ఘనంగా ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం వేడుకలు

 ఘనంగా ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం వేడుకలు

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల లోని న్యూ లెక్చరర్ గ్యాలరీ లో నిర్వహించారు. మోటివేషనల్ స్పీకర్ ప్రముఖ సైకాలజిస్టు , క్లినికల్ హిప్నోథెరపిస్టు డాక్టర్. సిరిగిరెడ్డి జయారెడ్డి అధ్యక్షతన ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్. కృష్ణ మోహన్, డాక్టర్ టీ. సాయి సుధీర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మానసిక ఒత్తిడిని ఎమోషనల్ ఇంటెలిజెంట్ లా తొలగించుకోన వచ్చునని వ్యక్తిగత సమస్యలను, చదువు సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఎమోషనల్ ఇంటెలిజెంట్ ద్వారా తొలగించుకొనవచ్చునని తెలిపారు. ఆత్మహత్యలు నివారించుకొనవచ్చునని ఏకాగ్రతతో వాటిని సక్రమంగా చేయడానికి హిప్నోథెరపి ఎంతో బాగా పనిచేస్తుందని డాక్టర్ జయారెడ్డి తెలిపారు. వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయెగపడుతుందని డాక్టర్ జయారెడ్డి పేర్కొన్నారు.మోటివేషనల్ క్లాసులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్. కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్సనాలిటీ డెపలప్ మెంట్ తోపాటు హిప్నోథెరపి కుడా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. క్లినికల్ హిప్నోథెరపిస్టు డాక్టర్. జయారెడ్డి ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రాక్టికల్ సైంటిఫిక్ డెమో ఇవ్వడం విద్యార్థులకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఈసందర్భంగా డాక్టర్. జయారెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈకా‌ర్యక్రమంలో మోటివేషన్ క్లాసుల బ్రోచర్ ను వైద్య కళాశాల వైస్. ప్రిన్సిపాల్ డాక్టర్. టీ. సాయి సుధీర్, డాక్టర్. కృష్ణ మోహన్ లు డాక్టర్. జయారెడ్డి తో కలిసి విడుదల చేశారు. ఈకార్యక్రమంలో వైద్య విద్యార్థులు,కాలేజ్ స్టాఫ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!