
లేపాక్షిలో షాపును తగ్గించుకున్న వ్యక్తి కిడ్నాప్
శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు;పుట్టపర్తి నియోజకవర్గం శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి పుట్టపర్తిలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ముగిసింది ఈ క్రమంలోనే లేపాక్షి కి సంబంధించి 57వ నెంబర్ షాపు దక్కించుకున్న రంగనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. పుట్టపర్తి సాయి ఆరామంలో షాపును దక్కించుకున్న అనంతరం రంగనాథ్ స్వగ్రామమైన లేపాక్షి కి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతని వెంబడించి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుని బంధువులు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మద్యం షాపు దక్కించుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Was this helpful?
Thanks for your feedback!