
అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలి
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి — ఏఐవైఎఫ్
కర్నూలు, న్యూస్ వెలుగు; అమరావతిని ఫ్రీజ్ జోన్ గా ప్రకటించి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల వారికి అవకాశం కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు డిమాండ్ చేశారు.బుధవారం నాడు స్థానిక సిఆర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో 22 వ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని ఈ మహాసభల్లో రాష్ట్రవ్యాప్తంగా యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి అనేక తీర్మానాలు చేయడం జరిగిందని ఆయన వివరించారు 2014 రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మూడుసార్లు సాధారణ ఎన్నికలు జరిగినప్పటికీ 2018లో మినహాయిస్తే ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం రాష్ట్ర పాలకులకు విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఆయన విమర్శించారు 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతానని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత సంతకానికే పరిమితమయ్యాడు తప్ప డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు లోని పారిశ్రామిక హబ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానిక యువత కే 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జీవో తీసుకురావాలని , రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 60 వేల మంది వాలంటరీ లను కొనసాగించి వారికి గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని, విభజన హామీల్లో భాగంగా వెనకబడిన రాయలసీమ జిల్లాల్లో కడపలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని, కర్నూలు జిల్లాలో వలసల నివారణ కోసం శాశ్వత పరిష్కారం కావాలంటే పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లైన వేదవతి, గుండ్రేవులను పూర్తిచేయాలని , రాష్ట్రవ్యాప్తంగా కల్తీ ఆహారం వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారని ఆహార కల్తీని నివారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా కల్తీ నివారణ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని , రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ను అరికట్టి విద్యార్థుల్లో యువతలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించి డ్రగ్ సప్లై చేసే వారిని కఠినంగా శిక్షించి డ్రగ్స్ రహిత రాష్ట్రముగా తీర్చిదిద్దాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఆన్ లైన్ లో అందరికీ తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం భవిష్యత్తు లో సమరశీల పోరాటాలకు కొనసాగించాలని రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని పై డిమాండ్లను సాధన కోసం ఏఐవైఎఫ్ గా రాష్ట్రవ్యాప్తంగా యువతలో చైతన్యం కలిగించి పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షాపిర్ భాషా ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, బిసన్న, నగర ఆఫీస్ బేరర్స్ చంటి, రవి, శ్రీకాంత్, శివాజీ, శ్రీను, మధు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు