
ఆరవెటీపల్లె లో పంటలను పరిశీలించిన ఏవో మా రెడ్డి వెంకటకృష్ణారెడ్డి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం ఆరవేటి పల్లెలో ప్రొద్దు తిరుగుడు, మొక్కజొన్న, పెసర పంటలను పరిశీలించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందించిన ఎన్ .డి .ఎస్ హెచ్ 1012 రకం పొద్దు తిరుగుడు పంటను పరిశీలించి పంట సాగు వివరాలను రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఆయన రైతులకు కొన్ని సలహాలు, సూచనలు వారికి తెలియజేశారు
Was this helpful?
Thanks for your feedback!