
వర్షపు నీటితో మునిగిన రోడ్లు నిరసనకు దిగిన BJP నేతలు
ప్యాపిలి (న్యూస్ వెలుగు ): ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామ ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడంతో బీజేపీ నాయకుడు టి. రమేష్ వర్షపు నీటిలో కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. వర్షం నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Was this helpful?
Thanks for your feedback!