
మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు ప్రజాప్రతినిధులు, సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!