
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; సాగు భూమి కి అర్హులైన పేదల తో డిసెంబర్ 9 న జమ్మలమడుగు RDO కార్యాలయం వద్ద ధర్నా దళిత హక్కుల పోరాట సమితి( DHPS)జిల్లా కార్యదర్శి కే మునెయ్య, గిరిజన సమాఖ్య(APGS )జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్,
దళిత డప్పు కళాకారుల సంఘం (DDKS)జిల్లా కార్యదర్శి G.నాగేశ్వరరావు లు తెలిపారు, నేడు *ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ( APGS,) జిల్లా కార్యదర్శి B,శంకర్ నాయక్ జిల్లా అధ్యక్షులు కే,బ్రహ్మం మరియు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కే మునెయ్య, దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి జి నాగేశ్వరరావు, జమ్మలమడుగు మండలం, చిట్టి మిట్టి చింతల తాండ గ్రామంలో ప్రచారం చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య APGS , దళితకుల పోరాట సమితి DHPS, దళిత డప్పు కళాకారుల సంఘం DDKS , ఆధ్వర్యంలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లోని సాగుభూమికి అర్హులైన పేదలతో డిసెంబర్ 9వ తేదీ సోమవారం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుందని అర్హులైన పేద రైతులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరచి అర్హులైన పేదలకు రెండు ఎకరాల సాగుభూమి కేటాయించడానికి నిరాకరిస్తూ ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికారులు అధికార పార్టీ నేతల మాటున డీకేటి మాఫియాకు విలువైన ప్రభుత్వ, వంక, వాగు, రస్తా, చెరువు, అసైన్డ్ ,దేవాదాయ, ఇనాం, వక్స్ ,భూములను కట్టబెట్టి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న నేపథ్యంలో అర్హులైన ఎస్ టి ఎస్ సి బి సి మైనారిటీ పేదలందరికీ రెండు ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని డిమాండ్ తో అర్హులైన పేదలను జమ్మలమడుగు ఆర్డీవో డివిజన్ పరిధిలోని పేదలందరూ ఈ ధర్నా కార్యక్రమంకు తరలి రావాలని పిలుపు ఇచ్చారు.
గతంలో పోరాడి సాధించుకున్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అడుగడుగునా ఉల్లంగించ బడుతోంది,
గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన రీ సర్వే 22 ఏ చట్ట సవరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యవసాయ కూలీల చేతుల ఉన్న భూములు కోల్పోయి ఒక్క ఎకరా భూమి కూడా పేదల చేతిలో మిగలదని వారు అన్నారు, బడుగు బలహీనవర్గాల పైన రాజకీయ ఆర్థిక సామాజిక వివక్ష చూపిస్తున్న పాలక ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు కడప జిల్లాలో ఉన్నటువంటి నాలుగు రెవిన్యూ డివిజన్ల పరిధిలో దశలవారి ఉద్యమంగా ఆయా డివిజన్లో ఉన్న అర్హులైన పేదల జాబితాను సిద్ధం చేయడానికి అధికార పార్టీ నేతలకు బానిసలై మొద్దు నిద్రలో ఉన్న అధికారులను తట్టిలేపడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదల జాబితా సిద్ధం చేయాలని సిద్ధం చేసిన జాబితాలను అసైన్డ్ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు, అలా లేని పక్షంలో ఈ జిల్లాలోని నాలుగు డివిజన్ పరిధిలోని అర్హులైన పేదలను సంఘటితం చేసి పెద్ద ఎత్తున త్వరలోకడప కలెక్టరేట్ ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు, జమ్మలమడుగు ఆర్డీవో డివిజన్ పరిధిలోని అర్హులైన పేదలు అందరూ డిసెంబర్ 9వ తేదీన సోమవారం ఆర్డిఓ కార్యాలయముకు ఉదయం 10 గంటలకు రావాలని వారు కోరారు,