
రాజకీయ నాయకుల పోరులో పేద విద్యార్థుల జీవితాలతో చలగాటాలు వద్దు
ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంజిత్ కుమార్, చిన్న, డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానంతరం ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంజిత్ కుమార్ చిన్న
ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు నెంబర్స్మెంటు, స్కాలర్షిప్ పథకాన్ని పూర్తిస్థాయిలో అందజేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎన్నో ప్రగాల్పాలు పలికినటువంటి నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గాని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గడిచిన తొమ్మిది నెలలో 780 కోట్లు రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇచ్చామని గొప్పలు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విద్యార్థుల అకౌంట్లో గాని, ఆయా కళాశాలల అకౌంట్లో నేటికీ చేరలేదు. చెప్పడంలో మాత్రమే గొప్పలు చూపిస్తున్నటువంటి నేటి ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు రాబర్స్మెంట్ ,విడుదల చేయకపోవడం చాలా దారుణం. చట్టసభల్లో ప్రజలను, విద్యార్థులను మోసం చేసే విధంగా ఫీజు రాబర్స్మెంట్ స్కాలర్షిప్ ను ఇచ్చామని గొప్పలు చెప్తున్నప్పటికీ నేటికీ ఫీజు మెంబర్స్ మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు మగ్గిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల పోరులో పేద విద్యార్థి జీవితాలను బలి చేయొద్దు అని వారు విమర్శించారు. కాబట్టి తక్షణమే ఫీజు రిమెంబర్స్ మెంట్, స్కాలర్షిప్ ను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని హెచ్చరించారు. లేని పక్షాన విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు. నాయకులు రవి, బాలు, శ్రీధర్, విమల, సరోజ, వాణి, తదితరులు పాల్గొన్నారు.