
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు తనిఖీ చేసిన (అడిషనల్) డీఎంఈ డా.వెంకటేశ్వరరావు.
సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబు
ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఎపి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడిషనల్) డీఎంఈ డా.వెంకటేశ్వరరావు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పూర్తిస్తాయిలో వైద్య సేవలు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు.
హెచ్వోడీలతో సమావేశం నిర్వహించారు అత్యవసర విభాగానికి సీఎంవోలతోపాటు మిగతా సిబ్బందిని కేటాయించాలని అన్నారు.
ఆసుపత్రి వైద్యులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు వైద్యులు పని వేళల్లో కచ్చితంగా ఆసుపత్రులో ఉండాలన్నారు.
స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి సత్వర ప్రారంభనానికి అన్ని విభాగాధిపతులతో సమావేశమయ్యి ఫిబ్రవరి మొదటి వారంలో అన్ని హంగులతో ప్రారంభించడానికి క్యాన్సర్ నివారణ మరియు దిశా నిర్దేశం ఇవ్వడం జరిగింది అని అన్నారు.
ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్, సివిల్, పరికరాలు మరియు వైద్య అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది.
ఆసుపత్రికి అత్యవసరమైన సహకారములు మరియు వైద్య పరికరాలకై సత్వర ఆదేశాలకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ, REH సూపరింటెండెంట్, డా.పృధ్వి వెంకటేష్, డిప్యూటీ సూపరింటెండెంట్, డా.సీతారామయ్య, డా.శ్రీరాములు, సీఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, డా.హేమనలిని, అడ్మినిస్ట్రేటర్,పి.సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నాగాంజన్, డా.కిరణ్ కుమార్, పలు విభాగపు వైద్యులు, డా.రామ్ శివ నాయక్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.శ్రీనివాసులు, డా.మాధవి శ్యామల, డా.లక్ష్మీ బయి, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ, శివకుమార్, ఆసుపత్రి ఎడి, రమేష్ బాబు మరియు కేఎంసి ఎడి, అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.