
ప్రతి గ్రామంలో ఉపాధి పనులను చేపట్టాలి; ఏపీఓ హేమ సుందర్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండలంలోని గల అన్ని గ్రామాల యందు ఉపాధి పనులను చేపట్టాలని తుగ్గలి ఏపీవో హేమ సుందర్ తెలియజేశారు. బుధవారం రోజున స్థానిక ఉపాధి కార్యాలయం నందు టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భాగంగా ఏపీవో హేమ సుందర్ మాట్లాడుతూ గ్రామాలలో వలసల నివారణ కొరకు ఉపాధి పనులను తప్పకుండా నిర్వహించాలని ఆయన తెలియజేశారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకొని ఉపాధి పనులలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు. ఉపాధి పనులలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా పనులను నిర్వహించాలని ఏపీవో తెలియజేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తక్షణమే ఉపాధి పనులను ప్రారంభించి ప్రజలకు పనులు కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశాడు.గ్రామాలలో ప్రజలతో మమేకమై ఉపాధి పనులను నిర్వహించాలని ఏపీఓ హేమ సుందర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈసీ ప్రదీప్,మండల టి.ఏలు,మండల ఎఫ్.ఎ లు మరియు సీనియర్ మేటీలు తదితరులు పాల్గొన్నారు.