FlatNews Buy Now
పరీక్షల సమయం విద్యార్థులకు ఎంతో కీలకం

పరీక్షల సమయం విద్యార్థులకు ఎంతో కీలకం

అనంతపురం, న్యూస్ వెలుగు; విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన అన్ని సబ్జెక్టులను పరీక్షల సమయంలో ఆ సబ్జెక్టులు వారిగా టైం టేబుల్ వేసుకొని చదవాలని మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ విద్యార్థులకు సూచించారు. అనంతపురంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో

డాక్టర్ పరమేష్ నాయక్ మాట్లాడుతూ పరీక్షల టైములో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఫోన్ చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ పరీక్షల టైంలో ఉన్న సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత ఒత్తిడికి లోను కాకుండా ఉండవచ్చని విద్యార్థులు ముందుగా పరీక్షల భయాన్ని వదిలివేయాలని విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో ఉన్న భయాన్ని ముందుగానే వారి టీచర్స్ దగ్గర డౌట్స్ను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలేజ్ కరస్పాండెంట్ ఎం శివ శంకర్, ప్రిన్సిపల్ ఎం రమేష్, వైస్ ప్రిన్సిపల్ టి చంద్రశేఖర్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS