
రీ సర్వే భూ సమస్యల పరిష్కారం పై గ్రామ సభ
హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఇంగళదహల్ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రీ సర్వేలో జరిగిన పొరపాట్లు భూ సమస్యల పరిష్కారం పై గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా రైతుల నుంచి అర్జీ స్వీకరించారు.అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని,ప్రభుత్వ పాఠశాలను,రేషన్ దుకాణాన్ని,ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతామని చెప్పారు.అలాగే బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినంతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి,హాస్టల్ వార్డెన్ శివుడు, విఆర్వోలు,గ్రామ సేవకుల,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda