శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

ఢిల్లీ న్యూస్ వెలుగు : ఈస్టర్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌరులకు, ముఖ్యంగా భారతదేశం మరియు విదేశాలలో నివసిస్తున్న క్రైస్తవ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే పవిత్రమైన ఈస్టర్ పండుగ నిస్వార్థ ప్రేమ మరియు సేవ యొక్క సందేశాన్ని తెలియజేస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. యేసుక్రీస్తు త్యాగం మరియు క్షమాపణ యొక్క విలువను బోధిస్తుందని ఆయన జీవితం మానవాళిని సత్యం, న్యాయం ,కరుణ మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు జీవిత విలువలను స్వీకరించాలని మరియు సమాజంలో శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించాలని రాష్ట్రపతి కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS