
బంగాళాఖాతంలో అల్పపీడనం సమావేశమైన సీఎం
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఆదివారం, సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!