నేడు మాంసపు విక్రయాలు బంద్

 నేడు మాంసపు విక్రయాలు బంద్

 నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం

 నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

కర్నూలు, న్యూస్ వెలుగు; గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎలాంటి జంతువులను వధించరాదని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కబేళాలు, అన్ని రకాల మాంసపు విక్రయ దుకాణదారులు ఆదివారం దుకాణాలను మూసివేయాలని, హోటళ్ళు, రెస్టారెంట్లలలో ఎట్టిపరిస్థితుల్లోనూ మాంసపు పదార్థాలు విక్రయించకూడదని తెలిపారు. నగర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతాయని, ఎవరైనా అమ్మకాలు చేస్తూ పట్టబడినా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి అమ్మకాలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అటువంటి దుకాణ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, భారీ జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు సైతం తీసుకుంటామని, కావున వ్యాపారాలు సహకరించాలని ప్రజారోగ్య అధికారి కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!