వక్ఫ్ బోర్డు ఆస్తులపై మోడీ కన్ను
డోన్ న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని అవాజ్ కార్యాలయంలో బీరువాల సలాం అధ్యక్షతన ఆవాజ్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు .
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, ప్రపంచానికి చాటిన ప్రజలమధ్య, హలాల్, పేరుతో, హిజాబ్ పేరుతో, ఆహారం పేరుతో, ట్రిపుల్ తలాక్ పేరుతో, ముస్లిం మైనారిటీల పై భౌతిక దాడులు చేస్తుంటే, వాటిని ఖండించకుండా, రాష్ర్ట ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం సరైనది కాదన్నారు. నరేంద్ర మోడీ ముస్లింలకు న్యాయ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు. ఈ చట్టం ముస్లింలకు నష్టమే తప్ప లాభం లేదని బీరువాలా సలీమ్ అన్నారు. భారత దేశం లో అధిక భూములు ఉన్న సంస్థలు మూడు ఉన్నాయని . మిలిటరీ భూములు, రైల్వే రంగం, వక్ఫ్ బోర్డు, భూములు ఉన్నాయని, వక్ఫ్ ఆస్తులపై, నరేంద్రమోదీ కన్ను పడిందని, ఈఆస్తులను కార్పొరేట్ సంస్థలను కట్టబెట్టుకు, మోడీ ప్రభుత్వం సిద్ధమైనదని, ముస్లింల పైన కపట ప్రేమ చూపిస్తున్నారని అవాజ్ నాయకులు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ బాష, నూరు బాష, మహబూబ్, ఆయేషా, ఖాజా, రఫీ, హుస్సేన్ పాల్గొన్నారు