మాంటిస్సోరీ విద్యార్థుల ర్యాలీ

మాంటిస్సోరీ విద్యార్థుల ర్యాలీ

కర్నూలు, న్యూస్ వెలుగు;  జూన్ 5, 2024న అంతరిక్షంలోకి అడుగిడి కొన్ని సాంకేతిక కారణాల చేత భూమి మీదకు తిరిగి రాలేక అక్కడే చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్ మోర్ లు 9 నెలల ఎడతెగని ప్రయత్నాలు ఫలించి చివరికి నేడు భూమి మీదకు తిరిగి రానున్న ఈ శుభ తరుణాన వారి యోగక్షేమాలను కోరుకుంటూ వారు క్షేమంగా ఈ ధరిత్రి పై తిరిగి అడుగిడాలని మాంటిస్సోరీ ఏ క్యాంపు పాఠశాల చిన్నారులు కలెక్టర్ కార్యలయం వరకు ర్యాలి నిర్వహించి, ఈ వ్యోమగాములకు తమ శుభాకాంక్షలు తెలియజేసారు. ర్యాలీలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!