
మాంటిస్సోరీ విద్యార్థుల ర్యాలీ
కర్నూలు, న్యూస్ వెలుగు; జూన్ 5, 2024న అంతరిక్షంలోకి అడుగిడి కొన్ని సాంకేతిక కారణాల చేత భూమి మీదకు తిరిగి రాలేక అక్కడే చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్ మోర్ లు 9 నెలల ఎడతెగని ప్రయత్నాలు ఫలించి చివరికి
నేడు భూమి మీదకు తిరిగి రానున్న ఈ శుభ తరుణాన వారి యోగక్షేమాలను కోరుకుంటూ వారు క్షేమంగా ఈ ధరిత్రి పై తిరిగి అడుగిడాలని మాంటిస్సోరీ ఏ క్యాంపు పాఠశాల చిన్నారులు కలెక్టర్ కార్యలయం వరకు ర్యాలి నిర్వహించి, ఈ వ్యోమగాములకు తమ శుభాకాంక్షలు తెలియజేసారు. ర్యాలీలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!