
నేడు పిజిఆర్ఎస్ ప్రజా వినతుల స్వీకరణ రద్దు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ వెలుగు; ఈ నెల 14 తేదీ పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు, మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!