
సుభద్ర పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజున సుభద్ర పథకాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమం కోటి మందికి పైగా మహిళలను కవర్ చేస్తుందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా 25 లక్షల 11 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి 1250 కోట్ల రూపాయల నిధుల విడుదల చేసారు. అంతకుముందు, భువనేశ్వర్లోని గడకానా వద్ద స్లమ్ ఏరియాను సందర్శించిన మోదీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్లో 20 మంది లబ్ధిదారులతో సంభాషించారు. యోజన కింద నిర్మించిన ఇళ్ల తాళాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.