ఏ కోడూరులో ట్యాంకుకు మరమ్మతులు

ఏ కోడూరులో ట్యాంకుకు మరమ్మతులు

బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్:  మండల పరిధిలో ఉన్న ఏ కోడూరు గ్రామంలోని రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన ట్యాంకు కు మంగళవారం నాటి నుండి మరమ్మతులు చేయడం ఆరంభించారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ట్యాంకు మరమ్మతులు చేయకపోవడం వల్ల పెచ్చులు ఊడటం తోపాటు శిధిలావస్థకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో గ్రామపంచాయతీ సర్పంచ్ జ్ఞానాభరణం ఆధ్వర్యంలో మరమ్మతులు చేయడం ఆరంభించారు. మరమ్మత్తుల వల్ల గ్రామములో మూడు నాలుగు రోజులపాటు కుళాయిలకు నీళ్లు రావని గ్రామ ప్రజలు ఈ విషయంలో సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!