భూ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ గ్రామసభలు

భూ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ గ్రామసభలు

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు; భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను రైతులంతా వినియోగించుకోవాలని ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. బుధవారం మండలంలోని పార్నపల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దేందుకే గ్రామసభలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భూ సమస్యలపై రైతుల నుంచి వివిధ దరఖాస్తులను స్వీకరించారు. ఈ గ్రామ సభలో రైతుల నుంచి 145 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ గురునాథం ఆత్మకూరు డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ రవీంద్ర పాల్ మండల సర్వేయర్ పర్వీన్ విఆర్ఓ అబ్దుల్ కలాం గ్రామ సర్వేయర్ రహిమాన్ టిడిపి నాయకుడు మురళీధర్ రెడ్డి సర్పంచ్ షబ్బీర్ అహ్మద్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!