
అమ్మవారి సేవలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గురువారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు దేవస్థానం నందు రుద్ర పారాయణ చేస్తున్న వేద విద్యార్థులతో ముచ్చటించారు.
Was this helpful?
Thanks for your feedback!