
అక్రమాలకు పాల్పడిన చేనేత సహకార సొసైటీల మీద చర్యలు తీసుకోండి
మైలవరం, న్యూస్ వెలుగు; నేతన్నలకు అండగా ఉంటూ వారి జీవనాభివృద్ధికి తోడుగా ఉండాల్సిన చేనేత సహకార సొసైటీలు విచ్చలవిడిగా అక్రమాలు చేస్తూ అటు నేతన్నలను ఇటు గవర్నమెంట్ ను మోసం చేస్తూ వస్తున్నాయి. జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలంలోని ఒక సొసైటీలో అక్రమాలు జరిగినట్టు మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాగర్ గారు కడప జౌలీ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. సాగర్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా వరకు చేనేత సహకార సంఘాలు అక్రమాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చాయని అటువంటి సొసైటీ ల యాజమాన్యం మీద తక్షణం క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ,రాబోయే చేనేత సొసైటీస్ ఎలక్షన్స్ కు దూరం పెట్టాలని, లేనిపక్షంలో మాల మహానాడు సంఘం పెద్ద ఎత్తున ధర్నాకు సైతం దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు కడప జిల్లా చేనేత మరియు జౌలీ శాఖ ఉన్నతాధికారి అయినటువంటి ఏ డి గారి ఆఫీసు నందు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు కిరణ్,ఓబులేసు పాల్గొన్నారు.