
విధులకు గైర్హాజర్ అవుతున్న ఎఎస్ డబ్ల్యూఓ ను విధులు నుంచి తొలగించాలి
ఈయన లోపం వల్లనే ఇక్కడి వార్డెన్లు కూడా డ్యూటీకి గైర్హాజరు…
అక్రమ అటెండెన్స్ వేసుకుంటున్న వార్డెన్ సుభాష్ గారిని విధులు నుంచి తొలగించాలి….
రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్
బద్వేల్, న్యూస్ వెలుగు; స్థానిక బద్వేల్ పట్టణంలోని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు, ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు జగన్,లింగమయ్య తదితరులు మాట్లాడుతూ, బద్వేల్ ఏ ఎస్ డబ్ల్యూ ఓ గా విధులు నిర్వహిస్తున్న రామయ్య గారు 11:00 గంటలు కావస్తున్న డ్యూటీ కి రాకుండా గైర్హాజరవుతూ మండల హెడ్ క్వార్టర్ లో నివసించకుండా కడపలో నివాసం ఉంటూ డ్యూటీ టైమింగ్ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని అదేవిధంగా ఒక అధికారిగా ఈయన ఈ విధంగా చేయడం వల్లనే ఇక్కడ వార్డెన్ సుభాష్ గారు డ్యూటీకి గైర్హాజర్ అవుతూ 105 మంది విద్యార్థులు ఉంటే కనీసం రాత్రి అయ్యేసరికి 20 మంది విద్యార్థులు కూడా లేకపోవడం అందరిని లోకల్ స్కూల్స్ విద్యార్థులను చేర్పించుకొని అటెండెన్స్ ఏమో 105 బిల్లులు కూడా 105 మందికి కానీ హాస్టల్లో అన్నం తినే విద్యార్థులు మాత్రం 20 మంది ఈ విధంగా అక్రమ మార్గంలో విద్యార్థులను చేర్పించుకొని లక్షల రూపాయలు బిల్లులు పెట్టుకుంటూ ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతూ వారి తమ్ముని హాస్టల్లో పెట్టుకొని వార్డెన్ ఉంటాడో ఉండడో ఏమో తెలియదు గానీ అక్కడ వారి తమ్ముని మెయింటెన్స్ మటుకు కనబడుతుంది ఈ విధంగా సొంత తమ్ముని హాస్టల్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న సుభాష్ గారిని తక్షణమే జిల్లా అధికారులు విధుల నుంచి తొలగించాలి వీటన్నిటికీ కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ASWO గారు మాత్రమే ఈయన కూడా ఇటువంటి వార్డెన్లకు సపోర్ట్ చేస్తూ వారి
ప్రకారమే లక్షలు రూపాయలు దొంగ బిల్లులు చేస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని దీనిపైన జిల్లా అధికారులు తక్షణం చర్యలు తీసుకుని ఇటువంటి అధికారులను విధుల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం….